బావిలోకి దూసుకెళ్లిన లారీ

– సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్‌
కరీంనగర్‌, జులై14(జ‌నం సాక్షి) : కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లి ఆరపల్లి రహదారిలో రోడ్డుకు ఆనుకొని ఉన్న బావిలోకి ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో లారీలో డ్రైవర్‌ ఒక్కడే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్‌ జగన్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ధర్మారం మండలం పత్తిపాక నుంచి విద్యుత్తు స్తంబాలతో గంగాధర మండలం మల్లాపూర్‌లో జరుగుతున్న విద్యుత్తు టవర్ల పనుల స్థలానికి లారీ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ మండలం ఆరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న మనిషిని తప్పించబోయి అదుపుతప్పి బావిలో పడిపోయింది. బావిలో పడే సమయంలో డ్రైవర్‌ చాకచక్యంగా బయటకు దూకడంతో ఈ ప్రమాదం తప్పింది.