మూడేళ్ల చిన్నారిని చంపేసిన తల్లి..

రంగారెడ్డి : జిల్లాలోని  మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం జరిగింది. తమకు అడ్డుగా ఉందనే కారణంతో  మూడేళ్ల చిన్నారి లక్ష్మీని కన్నతల్లి, సవతి తండ్రి కిరాతకంగా  హతమార్చి సంపులో పడేసింది. జయమ్మ, వరదరాజు దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరికీ గతంలోనే వివాహాలు కాగా విడాకులు తీసుకున్నారు. మొదటి భర్త సంతానమైన చిన్నారి లక్ష్మీ తల్లి దగ్గరే ఉంటోంది.
వారం క్రితం ప్రమాదవశాత్తు చిన్నారి కాలు విరిగింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. పాప భారంగా ఉందనే కోపంతో తల్లిదండ్రులే హత్య చేశారని స్థానికులు అంటున్నారు. చిన్నారి మెడపై కాళ్లతో తొక్కి హత్య చేశారని చెబుతున్నారు. ఈ సంఘటనపై అందిన ఫిర్యాదుతో పోలీసులు వచ్చి నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకున్నారు.