యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొడదల రామును ఫోన్ ద్వారా పరామర్శించిన రేవంత్ రెడ్డి.

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పరామర్శ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 17(జనంసాక్షి):
అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొడదల రామును బుధవారం
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధినేత కుటుంబాలపై ఈడీ పేరుతో వేధింపులను నిలిపివేయాలని హైదరాబాదులో నిర్వహించిన ధర్నాలో రాముకు గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందడం జరిగిందని త్వరగా కోలుకొని ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించినట్లు రాము తెలిపారు.