వననర్సరీలు ఏర్పాటు చేయాలి
జగిత్యాల,ఫిబ్రవరి9(జనంసాక్షి): గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వన నర్సరీల్లో పనులు వేగవంతం చే యాలని డీఆర్డీఓ పీడీ భిక్షపతి అన్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల ఫీల్డ్ అసి స్టెంట్లతో సవిూక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆయా గ్రామాల్లో ఒక గ్రామం..ఒక నర్సరీల ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేస్తున్న వన నర్సరీల్లో పనులను వేగవంతం చేయాలన్నారు. నర్సరీల్లో బ్యాగుల ఫిల్లింగ్ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సందర్భంగా నర్సరీల నిర్వహణ, ఉపాధి పనులు తదితర అంశాలపై సవిూక్షించారు.