నిజామాబాద్‌ జిల్లాలో కలకలం

నిజామాబాద్‌: జిల్లాకు చెందిన సీఐ విచారణకు సహకరించకుండా పరారయ్యాడు. దీంతో జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డిపై చీటింగ్‌ కేసులో విచారణ కోసం సీఐడీ అధికారులు వచ్చారు. 2011లో నమోదైన ఈ కేసు గురించి విచారిస్తుండగా బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి వెళ్లిన సీఐ పరారయ్యాడు. గతంలో తుప్రాన్‌లో పని చేసే సమయంలో బంగారం వ్యాపారికి సహకరించాడని శ్రీనివాస్‌ పై ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాస్‌ రెడ్డి కోసం సీఐడీ అధికారులు గలిస్తున్నారు.