జానంపేటలో దారుణం

8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య

మూసాపేట: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం జానంపేటలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని దుండగులు అపహరించి అతికిరాతకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన లక్ష్మి, విష్ణు దంపతులకు సంతోష్‌ (8) ఉన్నాడు. 3 రోజుల క్రితం సంతోష్‌ ఇంటి వద్ద  ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాలింపు చేపట్టిన  ఇవాళ జానంపేట సమీపంలోని బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. సంతోష్‌ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బంధువులే చిన్నారిని గొంతు నులిమి హత్య చేసి బావిలో పడేసి ఉంటారని వారు బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.