డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి

సికింద్రాబాద్ డిసెంబర్ 06 ( జనం సాక్షి ) ఓల్డ్ బోయిన పల్లి హాస్మత్ పేట్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ విగ్రహoనకు పూలమాలవేసి కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హక్కులనేతని ఓటు హక్కు ద్వారా దేశంలో రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి అని ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి పౌరునికి జీవితాన్ని ఇస్తుందని,న్యాయ శాస్త్ర మంత్రిగా ఉంటూ స్త్రీలకు హక్కులకై పోరాడిన వ్యక్తి అన్ని,అన్నివర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు రాజ్యాంగం లో చేర్చి రాజ్యాంగ పితగా పేరుపొందాడని,రాజ్యాంగ నిర్మాత దేశ భక్తుడు అలాంటి వ్యక్తి స్ఫూర్తితో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,నేను మరియు మా జన సైనికులు వీర మహిళల్లో జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటైన కుల మతాల ప్రస్తావ లేకుండా ప్రజాసేవలు చేసుకుంటాఅన్ని అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన పార్టీ నాయకులు పప్పు పటేల్,సంతోష్ గౌడ్ రాజమతుల,గొట్టిముక్కల వెంకట్,సత్యమూర్తి,గుండుల్ల జగదీష్,జనసేన వీర మహిళలు,పార్టీ కార్యకర్తల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.