అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత కొండమల్లేపల్లి ఎస్ ఐ నారాయణరెడ్డి

న్యూస్: పట్టణ కేంద్రంలో గురువారం నాడు గోవులను అక్రమంగా డీసీఎం లో కబేలాలకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో అక్రమంగా  తరలిస్తున్న గోవుల డీసీఎం ను పట్టుకున్నారు  అక్రమంగా తరలిస్తున్న సుమారు 70 గోవులను నల్గొండ రోడ్డు బైపాస్ లో  పట్టుకోవడం జరిగింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో బండి డీసీఎం  యాక్సిడెంట్ అవడంతో టోషన్ బండి ద్వారా డీసీఎం ను తరలిస్తుండగా అనుమానం వచ్చిన బీజేవైఎం నాయకులు పట్టుకొని పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు. గోవులను చండూరులో గల గోశాలకు తరలించారు.