అక్రమవెంచర్లపై నడుం బిగించిన అధికారులు…

నవంబరు 16 జనం సాక్షి భైంసా రూరల్

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అక్రమ వెంచర్ల పై బుధువారం అధికారుల కోరాడగప్పీ0చారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్ల,సరిహద్దులను తొలగించారు.పట్టణ సుద్దవాగు పరివాహక ప్రాంతంలో వరద నీరుకి అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించారు.
భైంసాలో మొత్తం 21 వెంచర్ల కు పర్మిషన్ లేనిదిగా గుర్తించి, దశల వారీగా తొలగిస్తున్నట్లు అదికారులు వెల్లడించారు. వెంచర్లపై కొరడా విధించిన వారిలో తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి,ఆర్డీవో లోకేశ్వరరావు,మున్సిపల్ కమిషనర్ అలీం, మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.