ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలి-వెన్నెల అశోక్.

భారత దివంగత మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరమ్మ పాలన ప్రపంచంలోనే ఆదర్శవంతంమైన పాలన దేశానికే చేసిన సేవలు మరువ లేనివని బోథ్ నియోజకవర్గ పిసిసి సభ్యులు వన్నెల అశోక్ కొనియాడారు.శనివారం ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మండలకేంద్రంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఇందిరమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ప్రస్తుతం రాష్ట్రంలో కుంటపడిందని విమర్శించారు. టీఆరెస్ ప్రభుత్వం మాటలు తప్ప ఏమి చేయలేదని ఆరోపించారు.రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇల్లు లేనివారికి డబుల్ బెడ్రూమ్ వంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందన్నారు.వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడే వసంత్ రావు నరేష్ రెడ్డి ఏలేటి రాజు రెడ్డి ఎండి సద్దాం తలమడుగు బోథ్ తాంసి మండలాల నాయకులు మల్లేష్ శ్రీకాంత్ రెడ్డి సంతోష్  భీమేష్ కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.