ఎంపి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

ఎంపి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

 

 

 

 

 

 

మెదక్ : బీఆర్ఎస్ ఎంపి, దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో పొట్ట భాగంలో ఆయనకు గాయాలు అయ్యాయి. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చినట్టే వచ్చి రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. గాయపడ్డ ఎంపిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. మంత్రి హరీష్ రావు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రజా ఆశీర్వాద సభలో ఉన్న సిఎం కేసీఆర్ సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దాడి  తనపై జరిగినట్టే భావిస్తున్నానని చెప్పారు.                 ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు   తెరలేపాయని, వీటిని ఆపకపోతే చూస్తూ                                   ఊరుకోమని హెచ్చరించారు.