కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు

కొమురం భీం,అగస్టు11(జనం సాక్షి): కాగజ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలతోపాటు అక్కడికి వచ్చిపోయేవారి ఆకలి తీర్చేందుకు సత్రం నిర్మించారు. అందరికీ అనుకూలంగా ఉండేలా కాగజ్‌ నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా సొంత నిధులతో విశాలమైన స్థలంలో సత్రాన్ని ఏర్పాటు చేశారు. కోనేరు కోనప్ప చొరవను ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, నలమోతు భాస్కర్‌,
ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. పేదలతో కలిసి అన్నదాన సత్రంలో భోజనాలు చేశారని, పేదల ఆకలి తీర్చేందుకు ఏకంగా సత్రాన్నే నిర్మించడం గొప్ప విషయమని తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు.