గాయత్రి మహా యజ్ఞానికి రావాలి

నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో  నిర్వహించనున్న లక్షల శ్రీ గాయత్రి మహా యజ్ఞానికి రావాలని జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ శాస్త్రుల మధుశ్రీ శర్మ గురువారం ఆయన మండల కేంద్రమైన శివ్వంపేట లో  జెడ్పిటిసి మహేశ్ గుప్తా ను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా మాట్లాడుతూ మనిషి సన్మార్గంలో నడవడానికి దైవచింతన ఎంతో అవసరమని, ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడం వలన ప్రజలలో శాంతి నెలకొని ఉంటుందన్నారు. ఈ మహా యజ్ఞ కత్రువుకు జడ్పీటీసీ తన సొంత నిధుల నుండి 51 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చందు శర్మ, సర్పంచులు చంద్రకళ శ్రీశైలం, అశోక్ రెడ్డి, రాజు నాయక్, టిఆర్ఎస్ నాయకులు పోచ గౌడ్, గౌరీ శంకర్,  సింహం, వెంకటేష్, అశోక్, ఖదీర్, రాజు  షేక్ అలీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.