గాయాలపాలయ్యిన వ్యక్తిని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన జాదవ్ రమేష్ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ జరిగి గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శనివారం రోజున వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్ఛారు.బలరాంతో పాటు మల్లేష్ పటేల్ జోర్ సింగ్ బాపూరావు దేవరి గణేష్ మహాదా జీవన్ రఘునాథ్ శివాజి ధనరాజ్ మోతిలాల్ హన్మంతు దర్బార్ సింగ్ తదితరులు ఉన్నారు.