ఘనంగా ఇందిరాగాంధీ జయంతి.

బెల్లంపల్లి,నవంబర్ 19, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఇందిరాగాంధీ 105 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు దేశానికి ప్రధానమంత్రి గా చేసిన సేవలను కొనియాడారు. గరిబీ హటావో అనే నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథాన నిలిపిన గొప్ప వ్యక్తి అని, బ్యాంకుల్ని జాతీయం చేసి సామాన్యుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన గొప్ప మహనీయురాలు అని ఆమె సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రజల కోసం పాటు పడి చివరి క్షణం వరకు తపించిన వ్యక్తి ప్రజా సేవలోనే నేలకొరగడం బాధాకరం అన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, టిపిసిసి సభ్యుడు బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచ్చార్జి చిలుముల శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లారపు చిన్నరాజం, కౌన్సిలర్ గుజ్జ రవి, డిసిసి సభ్యురాలు రొడ్డ శారద, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కటకం సత్తీష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్య‌క్ష‌ుడు ఎనగందుల వెంకటేష్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు బాకం మల్లేష్, సీనియర్ నాయకులు రొడ్డ శ్యామ్, లెంకల శ్రీను, చింతపండు శ్రీనివాస్, రామగిరి శ్రీనివాస్ గారు,దేవసాని ఆనంద్, సమ్మయ్య, గౌస్, ఉదయ్ సింగ్,మహిళా పట్టణ అధ్యక్షురాలు మినుగు సరోజ, కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు హరీష్, మహత్, సాయికిరణ్, పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..