ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

దండేపల్లి. జనంసాక్షి నవంబర్19 భారత తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ సంస్కరణలతోటి భారత దేశ అభివృద్ధి చేయడం జరిగిందని ఇందిరాగాంధీ తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలతోటి ఈరోజు భారతదేశ మనుగడ కొనసాగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎఐసిసి సభ్యులు కోక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంద్దుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల జెడ్పిటిసి గడ్డం నాగరాణి త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు ముత్యాల శ్రీనివాస్. కంది సతీష్ హేమలత. వనపర్తి మాలిక రవి సర్పంచులు బుక్య చంద్ర కళా, అన్నవేని ప్రేమల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్ చిట్ల రమణ అక్కల బుచ్చన్న మాజీ ఎంపీటీసీ సభ్యులు ఇప్ప సురేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంబడి సురేష్ బొమ్మన గోపి లక్ష్మీనారాయణ ముదురుకోళ్ల సురేష్ సిరికొండ నవీన్. Nsui మండల అధ్యక్షుడు నల్మిల వినయ్ తదితరులు పాల్గొన్నారు