ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

 నేరేడుచర్ల పట్టణంలోని చింత బండ ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా  హాజరైన నేరేడుచర్ల ఎంఈఓ చత్రు నాయక్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసముతో అన్ని రంగాలలో ముందుకు పోవాలని అన్నారు.అనంతరం ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి ప్రసాదు,నేరేడుచర్ల,పాలకీడు మండలాల అంగన్వాడి సూపర్వైజర్లు నాగరాణి,యశోద,ఐ ఇ ఆర్ పి జోత్స్నా, దివ్యాంగుల పిల్లలు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.