చెరువులో పడి యువకుడి మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని గౌతాపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం అన్నసారం యాదగిరి (28) తన తాత అంత్యక్రియల అనంతరం గౌతపుర్ పెద్ద చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫిట్స్ వచ్చి చెరువులో పడి మృతి చెందినాడు. మృతుడికి అమ్మ, నాన్న, భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన ఒకే ఒక్క కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలు అందర్నీ కంట తడి పెట్టించయి. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.