చేగుంట మెదక్ రోడ్డుపై రైతుల ధర్నా

మండలంలోని ఎస్ కొండాపూర్ గ్రామ పరిధిలోని రెవెన్యూ ఫారెస్ట్ భూముల వివాదాలు పరిష్కరించాలని రైతులు చేగుంట మెదక్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు ధరణి చట్టం వచ్చినప్పటి నుండి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడంలేదని  పలుమార్లు రెవెన్యూ అధికారు  దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు  ఆర్డీవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు ప్రభుత్వం పట్టించుకుని రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని ఆవేదన వ్యక్తం చేశారు