జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కొడకండ్ల, నవంబర్11( జనంసాక్షి ):జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన మెట్రో ఈవినింగ్స్ జర్నలిస్ట్ దూదిగాని నాగరాజు తండ్రి దూదిగాని గురువయ్య టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొద్ది రోజుల క్రితం మరణించగా ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.