తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ తాండూర్ మండల నూతన కమిటీ ఎన్నిక

మంచిర్యాల జిల్లా తాండూర్, నవంబర్ 16( జనం సాక్షి ):

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ తాండూర్ మండల నూతన కమిటీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానే ష్ అధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగినది అధ్యక్షులు గా మెట్టుపల్లి ధర్మయ్య, కార్యదర్శి గా ఇందారపు రాజేష్,ఉపాధ్యక్షులు గా బోగే కృష్ణ, కాశి పేట,సహాయ కార్యదర్శి గా ఎడ్ల గోపాల్,కోశాధి కారిగా బందెల సత్యమ్మ,12 మందిని కౌన్సిల్ సభ్యులుగా గజ్జెల వెంకన్న ,కరవేన కళ, ఉపేందర్, బాపు, కంబాల చందు, ఎర్ర మనోజ్, రాములు సన్యాసి, లక్ష్మణ్, లక్ష్మి, శంకర్ లను ఎన్నుకోవడం జరిగింది .
అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రైతు సమస్యలపై నిరంతరం ఉద్యమాలు ,పోరాటాలు చేస్తామని అన్నారు.