ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు పధకం అమలు చేస్తాం

దళిత బంధు ఇప్పిస్తామని దళారులు వస్తారు మోస పోవద్దు
ఎమ్మెల్యే రేఖ నాయక్
ఖానాపూర్ రూరల్ 28 నవంబర్ (జనం సాక్షి): ప్రజల్లోకి వెళ్లి అందరికి దళితబంధు పధకం అమలు చేస్తాం అని ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు.సోమవారం ఖానాపూర్ మండలం లోని రాజురా,సింగపూర్, చందు నాయక్ తండా,బావపూర్ (ఆర్) గ్రామాల్లో పర్యటించారు.ఆయా గ్రామాల్లోని దళితులతో కలిసి దళిత బంధు పథకం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖ నాయక్ మాట్లాడుతూ దళిత బంధు ఇప్పిస్తామని దళారులు వస్తారు అని వారిని నమ్మి మోస పోవద్దు అని ఆమె అన్నారు.ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుంది అని కొద్దిగా వెనుక ముందు అవుతుందని ఆమె అన్నారు.సీఎం కె సి ఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలు చేశారు అని కొనియాడారు,ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రేఖ నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.