ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి…

బుత్ స్థాయి నుంచి బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళిధర్ ఠాక్రే అన్నారు. బుధవారం మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బుత్ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ బిజెపి పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు దత్తా నికం, బిజేవైఎం మండల అధ్యక్షుడు పొత్రజ్ నవిన్, శివకుమార్, మహేష్, ప్రదీప్,జివన్, ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…