ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలి

బోథ్ మండలంలోని మర్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పి.హెచ్.ఎస్ (బాలికల) పాఠశాల తల్లా పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ ఏఐఎస్ ఎఫ్ ఆద్వర్యంలో కలక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతిపత్రం సమర్పించారు. ఆదివారం మండల కేంద్రానికి కలక్టర్ రాగా ఈ మేరకు సంఘ అధ్యక్షులు సుమెర్ పాషా ఆద్వర్యంలో సమస్యను కలక్టర్ కు ఏకరువు పెట్టారు.బోథ్ లో ఉన్న గ్రంథాలయం సౌకర్యాలు లేవని ఈ సమస్యను సైతం కలక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు సంఘ నాయకులు పేర్కొన్నారు.