బహిరంగ మలమూత్ర విసర్జనను నివారిద్దాం

వేమనపల్లి,నవంబర్ 19,(జనం సాక్షి)

ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామపంచాయతీలో సంపూర్ణ స్వ‌చ్ఛ‌త కోసం స్వ‌చ్ఛ‌తా ర‌న్ కార్యక్రమాన్ని సర్పంచ్ గాలిమధు,పంచాయతీ కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో నిర్వ‌హించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర‌తి ఇంటికి ఒక మ‌రుగుదొడ్డిని నిర్మించుకోవాల‌న్నారు. దీని కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జల‌ను ప్రోత్స‌హిస్తుంద‌న్నారు.బ‌హిరంగ మ‌ల మూత్ర విసర్జ‌న నివార‌ణ కోసం గ్రామపంచాయ‌తీ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం రావాల‌న్నారు.ఇంకా ఎక్కడైనా బ‌హిరంగ మ‌ల‌మూత్ర విసర్జ‌న ప‌రిస్థితులు ఉంటే,వెంట‌నే రూపుమాపాల‌న్నారు.ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు పూర్ణ చంద్ర రెడ్డి,నీల్వాయి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు దాసరి మల్లేష్,రాములు, అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు,ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్,విద్యార్థులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.