బానూరి గోనయ్యకు జెడ్పీటీసీ ఆర్థికసాయం అందజేత

మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన బానూరి గోనయ్య గౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తన సహచర గణాల ద్వారా తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులు, శివ్వంపేట జెడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా శుక్రవారం ఆయన ఇంటికెళ్లి గోనయ్య ను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోనయ్య గౌడ్ కు తనవంతు సహాయంగా తన స్వంత డబ్బులు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి నేనున్నాననే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మహేశ్ గుప్తా మాట్లాడుతూ అందరిలో ఒకడిగా, సమాజంలో అందరిని కలుపుకుపోయే బానూరి గోనయ్య అనారోగ్యం బారిన పడటం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ఆర్థికంగా మరింత సహకారం తప్పకుండా అందిస్తానని జడ్పీటీసీ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తన స్వంత డబ్బులను అందించి ఆదుకుంటున్న జెడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా కు శివ్వంపేట గ్రామస్థుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కారోబార్ వంజరి గౌరీశంకర్,వార్డు సభ్యులు బాసంపల్లి పోచగౌడ్, ముయ్యడి జ్యోతీ సింహం,తదితరులు పాల్గొన్నారు.