బొల్లారం మున్సిపాలిటీ వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటు కృషికై ఎమ్మెల్యే జిఎంఆర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డులలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి ఐడియాలక్ష్మి నగర్తో పాటుపలు వార్డులలో ఎస్ డి ఎఫ్ నిధులతో చేపడుతున్న యు జి డి అభివృద్ధి పనులకు పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు! ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ చంద్ర రెడ్డి, హనుమంత్ రెడ్డి, కార్మిక నాయకులు, మాజీ ఎంపిటిసి పెంటయ్య, పరశురాం, శేఖర్, వెంకటేష్ తదిరులు పాల్గొన్నారు.