భైంసా ఏరియా ఆసుపత్రికి నూతన భవనాన్ని మంజూరు చేయండి…

-మంత్రి హరీష్ రావు కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విన్నపం
జనం సాక్షి, భైంసా రూరల్ నవంబర్ 19
భైంసా ఏరియా ఆసుపత్రి కి నూతన భవనాన్ని మంజూరు చేయాలనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు గారికి ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు విన్నవించారు . ఈరోజు ఉదయం హైదరాబాదులో ఆయనను కలిశారు. అలాగే ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 50 పడకలను పెంచాలని కోరారు. ఎమ్మెల్యే గారి విన్నపంపై స్పందించిన మంత్రి గారు ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన అంచనా విలువలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.