మహా సభల పోస్టర్ విడుదల

దండేపల్లి. జనంసాక్షి నవంబర్ 16 ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ను దండేపల్లి మండల కేంద్రంలోని బుధవారం విడుదల చేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి.రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు 2022 నవంబర్ 27 28 29 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర మూడో మహాసభలు యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట లో జరుగుతుంది ఈ మహాసభలో సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరై కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పెర్క రాజేష్ సిపిఐ జిల్లా నాయకులు మేదరి దేవవరం స్థానికనాయకులు దర్శనాలరాజు మునిగి మాడుగుల చిన్నక్క. కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు