మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి

-సిఐ అజయ్ బాబు
ఖానాపూర్ ప్రతినిధి డిసెంబర్ 04(జనం సాక్షి): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఖానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. ఖానాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న తొలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో భాగంగా ఆదివారం అటవీశాఖ, పోలీస్ శాఖ టీంల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగింది. ఈ సందర్భంగా ఆయా శాఖ అధికారులు వారి చిన్ననాటి మధురస్మృతులు గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మ్యాచ్లో పోలీస్ శాఖ పై అటవీశాఖ విజయం సాధించింది. కార్యక్రమంలో ఖానాపూర్ ఎస్సై శంకర్, పెంబీ ఎస్ఐ రజనీకాంత్, ఎఫ్ఆర్ఓ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.