మృగాళ్లు.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం..
దోషికి 20ఏళ్లు జైలు, రూ.5వేలు జరిమానా
` మెదక్ జిల్లాలో దోషికి శిక్ష విధించిన న్యాయస్థానం
మెదక్(జనంసాక్షి)మెదక్ జిల్లాలోని పోక్సో కేసులో దోషికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శంకరంపేట (ఎ)మండలంలో 2022లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో సోమవారం తీర్పు వెలువరించింది. ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టిన థలారి మోహన్ అనే వ్యక్తిని దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.3లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.