రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది:

:భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పునరంకితమవుతామని అధికారులు సిబ్బందితో భారత సంవిధాన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి పూర్వం వివిధ రాజుల కాలంలో ఒక్కో చట్టం ఉండేదని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రతి పౌరుడికి న్యాయం జరగాలని, అందరికి ఆమోద యోగ్యంగా రాజ్యాంగం లిఖించుకోవాలని కమిటీ ఏర్పాటు చేసి, అంబేద్కర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. దేశంలో ఉన్న విభిన్న జాతులు, మతాలు, జీవన విధానం, జీవనశైలి ని దృష్టిలో పెట్టుకొని అందరికి సమన్యాయం చేయాలని ఉద్దేశ్యంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడు సమాజంలో జీవించడానికి సమాన హక్కులు, భాద్యతలు కల్పించిందని, నేడు వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడి నడుస్తున్నదని, ప్రతి సమస్యకు జవాబు దొరుకుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగాని చదివి ఆకళింపు చేసుకోవాలని కోరారు. బలమైన దేశంగా ఉండడానికి కారణం మన రాజ్యాంగమేనని, రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నదని అన్నారు. మనమందరం సంతోషంగా జీవిస్తున్నామంటే రాజ్యాంగం చలవే అని, అందరిని సంతృప్తి పరుస్తూ రచించిన రాజ్యాంగం మహామేధావి అంబేద్కర్ ను ఈ సందర్భంగా స్మరించుకుంటూ పునరంకితమవ్వాలని, భావితరాలకు మెరుగైన సమాజం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ శ్రీనివాస్, డీఎస్ ఓ శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, మత్స్య శాఖ ఎడి రజిని, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు