రెండు బైకులు డి పారా మెడికల్ స్టూడెంట్ మృతి

నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని పారా మెడికల్ స్టూడెంట్ కు తీవ్ర గాయాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పాపన్నపేట్ మండలం నామాపూర్ తండా కు చెందిన కాట్రోత్ ప్రవీణ్(22) సంగారెడ్డి లోని పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో డిప్లమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తున్నాడు. గురువారం ఎగ్జామ్ రాసి సంగారెడ్డి వెళ్తుండగా నర్సాపూర్ వస్తున్న బైకు ఢీకొనడంతో ప్రవీణ్ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెదక్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందు అక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి విట్టల్ కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.