సెలవుల్లో వెళుతున్న ఎంపీడీవోకు వీడ్కోలు.

ఎంపిఓకు తాత్కాలిక బాధ్యతలు.
నేరడిగొండనవంబర్11(జనంసాక్షి):మండల ఎంపీడీవో అబ్దుల్ సమద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికార సిబ్బంది అయినను శాలువా కప్పి ఘనంగా వీడ్కోలు పలికారు.ప్రస్తుతం ఎంపిఓగా విధులు నిర్వహిస్తున్న బి శోభననుతాత్కాలిక ఎంపిడిఓ బాధ్యతలు అప్పగించినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపిఓ శోభన ను అధికార సిబ్బంది కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.ఎంపిఓ మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలోసూపరింటెండెంట్ చక్రపాణి సీనియర్ అసిస్టెంట్ గంగారెడ్డి టైపిస్టు నాగేంద్ర కార్యాలయ సిబ్బంది ఉన్నారు.