డిగ్రీ కళాశాలలో కామర్స్ సెమినార్.

– “కాస్ట్ అండ్ మేనేజ్మెంట్” అంశంపై కార్యక్రమం
బెల్లంపల్లి, నవంబర్ 15, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అనే అంశంపై సెమినార్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ఎం గోపాల్ తెలిపారు. కళాశాల కామర్స్ విభాగం అధ్యాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు అకౌంట్స్ చదవడం గురించి, మేనేజ్మెంట్ విశేషాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు మేడ తిరుపతి, డాక్టర్ కాంపల్లి శంకర్, పి రవి, డాక్టర్ కంబాల మురళికృష్ణ, తిరుపతి, రామరాజు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.