సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. – ఏసీపీ ఎడ్ల మహేష్.

బెల్లంపల్లి, నవంబర్ 16, (జనంసాక్షి )
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల హెచ్చరించారు. బుధవారం ఆయన నెన్నెల మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పులు చేసిన వ్యక్తులే తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా ద్వారా పోలీసులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పోలీసులు నిజాయితీగా పరిశోదనా చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలు ముఖ్యంగా సివిల్ తాగాదాలతో పోలీస్ స్టేషన్ కు వస్తున్నారని, పోలీసులు సివిల్ తాగదాల్లో అస్సలు తల దూర్చరని, సివిల్ తాగాదాలు సంబంధిత అధికారుల వద్ద కానీ, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈసమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ కోట బాబురావు, నెన్నెల రాజశేఖర్ పాల్గొన్నారు.