జనంసాక్షి అమీన్‌పూర్‌ విలేకరి సస్పెండ్‌

హైదరాబాద్‌ : జనంసాక్షి సంస్థలో అమీన్‌పూర్‌ విలేకరి సంతోష్‌ నాయక్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తక్షణం ఆయనను సంస్థ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆయనకు జనంసాక్షి సంస్థకు ఇకనుంచి ఎలాంటి సంబంధం ఉండదు. గతంలో దశాబ్దకాలంపైగా రెండు ప్రధాన మీడియా సంస్థల్లో పనిచేసి గత ఐదు నెలల కింద జనంసాక్షిలో చేరాడు. తాజాగా సంతోష్‌ నాయక్‌పై ఆరోపణల నేపథ్యంలో అమీన్‌పూర్‌ విలేకరి బాధ్యతల నుంచి సస్పెండ్‌ చేస్తూ సంస్థ చర్యలు తీసుకుంది. అయితే ఆయన సంస్థలో అక్రిడిటేషన్ జర్నలిస్టు కాకపోవడం గమనార్హం.