అరకు పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా చటారీ.సాయిబాబా నియామకం.

డుంబ్రిగుడ(ఫిబ్రవరి 18 జనం సాక్షి) అరకు పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా చటారీ.సాయిబాబాను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,జిల్లా ఇన్చార్జి పి.శాంతి కుమారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా సాయిబాబాను నియమించారు.ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ అరకు పంచాయితీకి చెందిన చటారీ.సాయిబాబాను గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా పార్టీకి అతను అందించిన సేవలు కృషి పట్టుదలను గుర్తించి తనపై నమ్మకంతో ఈ బాధ్యతను తనకు ఇస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి బలోపేతం చేయడానికి మండలం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో కలిసి గిరిజన ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని స్పష్టం చేశారు.