తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్‌ పాలాభిషేకం

హైదరాబాద్‌: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.