ఆత్మగౌరవ గులాబీ జెండా

గులామి గుజరాత్‌ ఏజెంటా?

జిహెచ్‌ఎంసి ప్రచార సభలో కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌,నవంబర్‌23 (జనంసాక్షి): వరద బాధితులకు రూ.10వేలు సాయం చేశామని, వరద సాయం ఇస్తే నోటికాడి ముద్దను అడ్డుకున్న బిజెపి నేతలకు బుద్ది చెప్పాలని మంత్రి కెటిఆర్‌ పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రూ.10వేలు సాయం చేస్తుంటే ఆపినోడు.. రూ.25వేలు ఇస్తడా? అని ప్రశ్నించారు. వరద బాధితులందరికీ ఎన్నికల తర్వాత తప్పనిసరిగా సాయం చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలో ఎల్బీనగర్‌ నియోజకవర్గం లో 11 డివిజన్లకు 11 డివిజన్లలో గెలిపించారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బల్దియాపై గులాబీ జెండా ఎగరడంలో ఎల్బీనగర్‌ది కీలకపాత్ర అని అన్నారు. ఆరేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందో అడగాలని ప్రజలకు ఆయన సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో పలుచోట్ల కెటిరా/- రోడ్‌ షోలు నిర్వహించారు. మన్సురాబాద్‌ బిగ్‌బజార్‌ చౌరస్తాలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ‘ఎల్బీనగర్‌, నాగోల్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఫ్లై ఓవర్లు నిర్మించింది. ఆసరా పెన్షన్లు, ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. సర్కారు బడుల్లో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నాం. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు బాకీ ఉన్నాం.. అవి కూడా తప్పకుండా ఇస్తాం. దేశాన్ని సాకుతున్న రాష్టాల్లో తెలంగాణ ఒకటి. ట్రాఫిక్‌ చలాన్లు కడుతామంటూ యువకులను రెచ్చగొడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ‘కాంగ్రెస్‌, బీజేపీలు చేసిందేవిూ లేదు. ఆరేళ్లలో కేంద్రం నయాపైసా సాయం చేయలేదు. టీఆర్‌ఎస్‌ పేదల పక్షపాత ప్రభుత్వం. గడిచిన ఆరేండ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 2 లక్షల 72 వేల కోట్లు వెళితే తిరిగి కేంద్రం మనకిచ్చింది ఎంతయ్యా అంటే రూ. లక్ష 40 వేల కోట్లు మాత్రమే. అంటే రూపాయి పోతే ఆటానా వెనక్కి వస్తుంది. మరి మిగతా ఆటానా ఎక్కడికి పోతుంది. మరి ఎవరు ఎవరికి ఇచ్చినట్టు. సొమ్ము ఎవరిది సోకు ఎవరిది. తెలంగాణ పైసలతో ఢిల్లీలో కులుకుతున్నరని మంత్రి కేటీఆర్‌ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహేశ్వరం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహణ చేపట్టారు. ఇందులో భాగంగా మహేశ్వరం పరిధిలోని సరూర్‌నగర్‌, ఆర్‌కేపురం డివిజన్లకు సంబంధించి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం ఎదురుగా ఉన్న ఎన్‌టీఆర్‌ నగర్‌లో చేపట్టిన రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు. మళ్లీ ఇక్కడివచ్చి ఏం మాట్లాడుతున్నరని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని తెలంగాణెళి ఎన్డీయే ప్రభుత్వానికి ఇస్తుందన్నారు. దేశాన్ని ఐదారు రాష్ట్రాలే సాకుతున్నాయన్న మంత్రి అందులో తెలంగాణ ఒకటన్నారు. ఆరేళ్ల కిందట ఎన్నో అనుమానాలు, సందేహాలు, ప్రత్యర్థులు సృష్టించిన భయాందోళనలను పటాపంచలు చేశామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించాలని ప్రజలను అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కరెంట్‌ పరిష్కారం అయింది. మంచినీళ్ల సమస్య పరిష్కారం అయింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించాలన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటున్నమన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రూ. 5కే భోజనం. పేదవాడికి సుస్తీ చేస్తే బస్తీ దావాఖానాల ఏర్పాటు, సీసీ టీవీ కెమెరాలు, ఎల్‌ఈడీ లైట్లు, షీటీమ్స్‌, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. కర్ణాటకలో వరదలొస్తే ఆ రాష్ట్ర సీఎం ఉత్తరం రాస్తే నిధులు విడుదల చేస్తారు. గుజరాత్‌లో వరదలొస్తే ప్రధానే స్వయంగా వెళ్లి సాయం ప్రకటిస్తారు. అదే హైదరాబాద్‌కు వరదలొస్తే సీఎం లేఖ రాసినా కనీసం పట్టించుకోలేదన్నారు. మనని పట్టించుకోని బీజేపీకి మనమెందుకు ఓటు వేయాలన్నారు. శాంతియుతంగా ఒకరితో ఒకరం కలిసి ముందుకుసాగుతున్నామన్నారు. అందరికి తానొకటే విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బీజేపీ వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే ఏం ఇచ్చింది విూ బీజేపీ హైదరాబాద్‌కు.. ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నరని ప్రశ్నించాల్సిందిగా కోరారు.