ఈదుల పల్లి లో సర్పంచ్ అధ్వర్యంలో ర్యాలీ

ఝరాసంగం ఆగస్టు 13 (జనంసాక్షి) మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ బస్వరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే సంబరాలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.