ఉద్యమకారులపై అణచివేత తగదు

రంగారెడ్డి,నవంబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసులు ఎత్తేయాలని జిల్లా ఐకాస అధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రజా సమస్యలను లేవనెత్తుతూ వాటిని సాధించే దిశగా పనిచేస్తుందని చెప్పారు. సాగునీటి సదుపాయాలే జిల్లాకు ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం సాగునీరు అందిస్తానని చెబుతున్నా అందులో స్పష్టత లేదని అన్నారు. ఎక్కడినుంచి ఎంతమేరకు వస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.రంగారెడ్డి జిల్లాకు సాగునీటి అంశంపై ఇంజినీర్లతో చర్చించి త్వరలోనే కార్యాచరణ చేపడతామని అన్నారు.