ఉమ్మడి జిల్లాలో జోరుగా హరితహారం ఏర్పాట్లు

అడవుల విస్తీర్ణం పెంపు కోసం కసరత్తు

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అధికారులు

వరంగల్‌,జూలై11(జ‌నం సాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేలా జిల్లాల యంత్రాంగం సిద్దం అయ్యింది. నాలుగో విడతకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈసారి అయిదు జిల్లాల వ్యాప్తంగా అయిదు కోట్లకుపైగా మొక్కలు నాటడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా 227 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. వీటిల్లో దాదాపు 60 శాతం టేకు మొక్కలే ఉన్నాయి. గ్రావిూణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, పోలీసు, విద్యా, తదితర శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. వరంగల్‌ నగరంలో మొక్కలు నాటే బాధ్యతను వరంగల్‌ మహానగర పాలక సంస్థ తీసుకొంది. ప్రస్తుతానికి 10 లక్షల మొక్కల్ని నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. హరితహారం విజయవంతం కావాలంటే గ్రామ స్థాయి ప్రజల భాగస్వామ్యం ఉండాలని సర్కారు భావించింది. అందుకే గ్రామాల్లో గ్రామ హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. అధికారులు ఊరూరా తిరిగి కమిటీలతో సమావేశమై మొక్కలు నాటాక సంరక్షణ బాధ్యతను వారికి అప్పగించేందుకు ప్రణాళిలకు సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని, ఆరు గ్రామాలకు ఒక జిల్లాస్థాయి అధికారిని నియమిస్తోంది. కమిటీలు చురుగ్గా పాలుపంచుకునేలా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. ఇకపోతే జిల్లాలో హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్దం చేసినట్లు కలెక్టర్‌ ఆమ్రపాలి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న భూపాలపల్లిలో సిఎం కెసిఆర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరితహారం కింద జనగామ జిల్లాలో ఆటవీ సంపదను 33 శాతాని పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం జనగామ జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్‌ చొరవతో సీడ్‌ బాంబింగ్‌ పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేశారు. ఒకవైపు నర్సిరీల ద్వారా పెంచుతున్న మొక్కలను వివిధ ప్రాంతాల్లో నాటుతూనే మరోపక్క ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన సీడ్‌బాల్స్‌ జిల్లా వ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో చల్లేందుకు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఏటా కోటి మొక్కలు నాటి గ్రామాలకు పచ్చలహారం తొడిగేందుకు హరితహారంలో భాగంగా మొక్కలు పెంచాలనే నిర్ణయానికి సీడ్‌బాల్స్‌ తయారీకి శ్రీకారం చుట్టారు. అడవులను 33 శాతానికి పెంచేందుకు మ¬ద్యమంలా మొక్కల పెంపకానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దీంతో కరువు జిల్లా జనగామలో ప్రయోగించిన సీడ్‌బాల్స్‌ మొలకెత్తి హరితహారం ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, కంటూరు కందకాలు, ఖాళీ ప్రదేశాల్లో వేసిన విత్తన బంతులు ఇటీవల వర్షాలకు మొలకెత్తి జిల్లా యంత్రాంగం ఆశలకు ఊపిరిలూదాయి. విత్తన బంతులు విసిరే కార్యక్రమం విజయవంతం కావడంతో రెండో విడత బంతులు వేయడానికి అధికార యంత్రాంగం సన్నద్దమైంది. ఒక్కో గ్రామపంచాయతీలో 40 నుంచి 50 వేల చొప్పున ఒకేరోజు కోటి 10లక్షల విత్తన బంతులను తయారు చేశారు. జిల్లాలో వ్యాప్తంగా వివిధ నర్సరీల్లో 98లక్షల మొక్కలను పెంచుతున్నారు. వీటికి తోడు జిల్లాలో మరో కోటి 10లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు పోతుంది. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం విజయవంతం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు డీఆర్‌డీవో జయచందర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో అటవీ సాంద్రత తక్కువగా ఉండంతో అటవీ సాంద్రతను పెంచాలని దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. దీనికి తోడు అన్ని మొక్కలకు జియో ట్యాగింగ్‌ను ఏర్పాటు చేస్తోంది.