ఓటరు చైతన్యంపై పోటీలు

జగిత్యాల,జనవరి19(జ‌నంసాక్షి):ఈనెల 25న జాతీ య ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వ హించినట్లు మండల విద్యాధికారి ఎం.నారాయణ తెలిపారు. ఓటరు చైతన్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు జగిత్యాల మండల స్థాయి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో తెలుగు విూడియంలో జగి త్యాల బాలికల పాఠశాలకు చెందిన ఏ వనజ ప్రథమ స్థానంలో, మోతె జెడ్పీహెచ్‌ పాఠశాలకు చెందిన బీ రినిత ద్వితీయ, పురాణిపేట జీహెచ్‌ పాఠశాల కు చెందిన ఓ జీవన తృతీయ, ఇంగ్లిష్‌ విూడియంలో ఓల్డ్‌ హైస్కూల్‌ చెందిన ఎన్‌. మేఘన ప్రథమ, జీహెచ్‌ బాలికల పాఠశాలకు చెందిన పీ సాయితేజ ద్వితీయ, ఓల్డ్‌ హైస్కూల్‌ చెందిన ఏ హేమల త తృతీయ, ఉర్దూ విూడియంలో ఖాజీపుర జీహెచ్‌ చెందిన రఫియా తహనియాత్‌ ప్రథమ, నసెహ నాజ్‌ ద్వితీయ, ఫోర్ట్‌ హైస్కూల్‌ చెందిన రఫత్‌ ఫాతిమా తృతీయ, ఉపన్యాస పోటీల్లో తెలుగు విూడియంలో మోతె జెడ్పీహెచ్‌ చెందిన జే రష్మిత ప్రథమ, కండ్లపల్లి టీఎస్‌ చెందిన డీ రాజు ద్వితీయ, ఇంగ్లిష్‌ విూడియంలో జగి త్యాల టీఎస్‌ చెందిన ఎం.పావని ప్రథ మ, ఓల్డ్‌ హైస్కూల్‌ చెందిన ఎస్‌.సృతి ద్వితీయ, పీ ప్రవలిక తృతీయ, ఉర్దూ విూడియంలో ఖాజీపురకు చెందిన హఫ్‌ అల్‌ ప్రథమ, రజ నూర్‌ ద్వితీయ, ఈష రక్షి తృతీయ స్థానాల్లో నిలిచారు.