ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మహిళల మృతి
ఖమ్మం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశ్రీ సర్కిల్‌ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకలకు వచ్చిన పెద్దపల్లికి చెందిన శ్రీలత, గోపాలపురానికి చెందిన కమల ఈ ప్రమాదంలో మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ అతి వేగంగా ఆటో నడపడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు చెప్పారు. ఇద్దరు మహిళల మృతితో ఆయా గ్రామాల్లో విషాదాఛాయలు అలుముకున్నాయి. అర్బన్‌ సీఐ సాయి రమణ కథనం ప్రకారం.. ఖమ్మం వైపు వస్తున్న ఆటోను వైరా రోడ్డు విూదుగా వెళ్తున్న ఓ లారీ అతివేగంతో ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడి పెద్దపల్లి జిల్లా మంగపేట గ్రామానికి చెందిన రంగు శ్రీలత(35), ఖమ్మంలోని గోపాలపురానికి చెందిన జి. కమిల(39) అక్కడిక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.