నగరంలో జాబ్‌మేళా ప్రారంభం

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు ప్రముఖు కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, ఉప మేయర్‌ మురళి ప్రసాద్‌, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.