ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: చాడ వెంకట్‌రెడ్డి

ఖమ్మం, ఆగస్టు29: ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌ చిత్తశుద్ధి లేదని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలను సంప్రదిస్తే సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలభింస్తోందని విమర్శించారు. సర్కార్ తీరు ఇలాగే ఉంటే ప్రజలు గుణపాఠం చెబుతారని చాడ హెచ్చరించారు.