బాసరకు అదనపు బస్సులు

తిరుగు ప్రయాణాలకు ఆర్టీసీ ఏర్పాట్లు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  విజయదశమి సందర్భంగా బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తారు. బాసరకు సాధారణంగా వెళ్లే బస్సులతో పాటు అదనపు ట్రిప్పులను అదనంగా పెంచినట్లు పేర్కొన్నారు. పండుగ సెలవులు అక్టోబర్‌ 21వరకు  ఉన్నందున ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యేందుకు బస్సులను సిద్ధం చేశారు. ప్రజలను తరలించేందుకు అధికారులు అదనపు బస్సులను, ట్రిప్పులను ఏర్పాటు చేయడంతో సాధారణ రోజుల్లో కంటే పండుగ పదిరోజులపాటు ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రభుత్వ కళాశాలలకు, విద్యాసంస్థలకు 15రో జుల పాటు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉద్యోగ రీత్యా స్థిర నివాసం ఏర్పర్చుకున్న వారు, ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌లో ఉంటున్న యువతీ యువకులు పండుగల సందర్భంగా తమ స్వస్థలాలకు చేరుకుని పండుగ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బస్‌ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. పండుగల సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. అలాగే మహారాష్ట్ర సవిూపంలోని కేలాపూర్‌లో జగదాంబ ఆలయాన్ని దర్శించుకునేందుకు జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలి వెళ్తారు. వారి సౌకర్యార్థం అదనపు ట్రిప్పులు నడుపుతున్నారు.