మెట్రో సేవలు రద్దు

ఆర్టీసీ సర్వీసులకూ బ్రేక్

నేటి జనతా కర్వ్యూతో రవాణా నిలిపివేత

ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు

– ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు

హైదరాబాద్,మార్చి 21(జనంసాక్షి):కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రమంతా జనతా కర్ఫ్యూకు సిద్ధమయ్యింది. ఆదివారం జనసంచారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రవాణా వ్యవస్థను బంద్ చేశారు. మెట్రో సర్వీసులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో పౌరులు దయచేసి ప్రభుత్వ సూచనలు పాటించా ల్సిందిగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనాపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. సామాజిక దూరం, వ్యక్తిగత నిర్భందం, వ్యక్తిగత నియమాలను పౌరులు తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు. తక్షణం స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న హాంకాంగ్, మాల్స్ సింగపూర్, జపాన్లు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుండగా ఇటలీ, యూఎస్, ఇతర దేశాలు ఏ తీసుకోవాలని వాదిస్తున్న 24 విధంగా అల్లాడిపోతున్నాయో చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కావునా ప్రభుత్వం సూచనలు పాటించి సురక్షితంగా ఉండాల్సిందిగా కేటీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ వద్ద పోలీసులు, వైద్యాధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగిస్తున్న వారిని దోషులకు పనిచేయనున్నట్లు నిశితంగా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల వివరాలను కూడా పోలీసులు రిస్తున్నారు. కరొనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు తప్ప చేశారు. ప్రతి చెక్ పోస్టు వద్ద రవాణా శాఖ నుంచి ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అక్కడే ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు. . కరీంనగర్ పరిస్థితులపై ఆరా న్యాయం ముఖ్యమంత్రి కరోనా పరిస్థితిపై కరీంనగర్ లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, నిత్యావసరాలు పోలీసు కమిషనర్లను ఆరా తీస్తున్నారు. వారు కూడా కరీంనగర్ లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో . సిఎంకు భరోసానివ్వడమే కాకుండా తాజా పరిస్థితులను వెల్లడిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కాకుండావైరస్ కరోనా వైరసను అరికట్టడంలో ముందంజలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమై కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత భరోసాని నింపేందుకు . స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ పర్యటనకు పూనుకున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో సిఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలుగకుండా పిలుపును కలిగి ఉండాలని కరీంనగర్ జిల్లా యంత్రాగం, వైద్యశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు శనివారం సిఎం తల పెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. నేడు హైదరాబాద్ మెట్రో రైలు సేవలు బంద్ , జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు మెట్రో రైలు సేవలు నిలిపివేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ సైరన్ అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే తెలంగాణ పంపేందుకు ప్రయాణికులకు ఈ సంస్థ అవగాహన కల్పిస్తోంది. మరోవైపు దిల్లీ మెట్రో సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు నిన్న ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుమేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు తెలుగు రాష్ట్రాల . ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.