మెదక్‌లో ఉరేసుకున్న వ్యక్తి

మెదక్‌, మార్చి 2: సూసైడ్‌నోట్‌రాసి ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. జిల్లాలోని నారయణఖేడ్‌ మండలం, సంజీవన్‌రావుపేటలో ఈ ఘటన జరిగింది. అస్రఫ్‌(45) అనే వ్యక్తి కుటుంబ కలహాల వల్ల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన స్థానికులు పరిశీలించగా అతడి వద్ద సూసైడ్‌నోట్‌ దొరికినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెప్పారు.